New PHC with the help of Reliance





           
హైదరాబాదులోని ప్రజా ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ 

డైరెక్టరు గారు తూర్పుగోదావరి జిల్లా , తాళ్ళరేవు మండలంలోని గడిమోగ 

అనే గ్రామములో ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 

ప్రకటించారు.
దీనికి సి.యస్.ఆర్. అనే సంస్థకు చెందిన రిలయన్స్ కంపెనీ 

వారు ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుటకు అంగీకరించారు. ఈ హాస్పటల్ 

నిర్మాణము వల్ల గడిమోగ గ్రామంతో పాటుగా పోలెకర్రు, పి.మల్లవరం, 

భైరవపాలెం గ్రామాలలో నివసించే 25000 మంది ప్రజలకు వైద్యసేవలు 

అందుతాయని ఆశిస్తున్నారు. ఈ ఆసుపత్రి ఐపిహెచ్చిఎస్ వారి స్థాయిలో 

ఏ.పి.యం.యస్.ఐ.డి.సి. సహకారంతో నిర్మించబడుతుంది. రిలయన్స్ 

కంపెని వారు ఈ ఆసుపత్రికి కావలసిన పరికరాలు సమకూరుస్తామని, ఈ 

ఆసుపత్రి నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులకుగాను ప్రతిఏటా రు.20 

లక్షలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఆవిధంగా దీనిని నిర్మించి వైద్య 

ఆరోగ్య శాఖవారికి అప్పగించారు.


ప్రభుత్వము దీనికి 8 పోష్టులు మంజూరు చేసింది. జీతాల క్రింద 

రు.34,88,381/-, మందులు, శస్త్రచికిత్సల పరికరాలకు, లెనిన్, డైట్ 

ఖర్చులకు రు.5 లక్షలు మంజూరు చేశారు. ( నిర్వహణ ఖర్చులకు 

అవసరమైన రు.20 లక్షలను రిలయన్స్ కంపెనీ వారు అందిస్తారు)


No comments

Powered by Blogger.